- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
తెలంగాణ స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డుకు మండల పరిధిలోని మైలార గ్రామ వాసి ఎంపికైనట్లు మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. మైలారం గ్రామాానికిి చెందిన రవి ప్రకాష్ కవి రచయిత విద్యావేత్త తెలంగాణ రత్న అవార్డు గ్రహీత తెలిపారు. అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య సంస్థ వారు ఈ అవార్డుకి ఎంపిక చేశారని ఈనెల 18న విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయ భవనంలో ఈ అవార్డును సంస్థ వారు రవి ప్రకాష్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అవార్డు రావడం పట్ల గ్రామస్తులు మిత్రులు శ్రేయోభిలాషులు మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



