నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ డివిజన్ కమిటీని విద్యుత్ కార్మికులు గురువారం హుస్నాబాద్ 132 కెవి సబ్ స్టేషన్ ప్రాంగణంలో రాష్ట్ర నాయకులు పప్పు వెంకటేశ్వర్లు సమక్షంలో డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. హుస్నాబాద్ డివిజన్ జేఏసీ చైర్మన్ గా కాశ బోయిన అశోక్ ,కన్వీనర్ గా నీలి రాజేందర్, శ్రీధర్ ,కో చైర్మన్ గా బడుగం సురేందర్ రెడ్డి , జరిపోతుల మహేందర్, కో కన్వీనర్ హరి సందీప్ ,వేణుగోపాల్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొర్ల కుమార్ యాదవ్, తాడెం కుమార్, హరీష్ హుస్నాబాద్ డివిజన్ కార్మికులు పాల్గొన్నారు.
విద్యుత్ కార్మికుల డివిజన్ కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



