- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య రాజక్క అంత్యక్రియలు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తిలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఒకే చితిపై పూర్తయ్యాయి. రంపచోడవరం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, వారి మృతదేహాలను ఛత్తీస్గఢ్కు తరలించారు. ఈ నెల 18న అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -



