- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు మనోజ్ఞ, పల్లవి నవంబర్ 20న జరిగిన ఉమ్మడి జిల్లా ఖోఖో పోటీలలో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొంతుల రవీందర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరు ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాజం రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, క్రీడాకారులు పాల్గొన్నారు.
- Advertisement -



