- Advertisement -
హైదరాబాద్ : భారత్లోని విద్యార్థులకు అమెరికాలో విద్యను మరింత చేరువ చేయడానికి వీలుగా యూఎస్ కాన్సూలెట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వై యాక్సిస్ ఫౌండేషన్ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా విద్యార్థులకు యుఎస్లో విద్యను విశ్వసనీయంగా మార్చడానికి వీలుగా యూఎస్ రాయబార కార్యలయంతో జట్టు కట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ఈ ఒప్పందంలో అమెరికా కాన్సలేట్ జనరల్ హైదరాబాద్ జెనిఫర్ లార్సన్, వై ఆక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్ పాల్గొన్నారు. యూఎస్లో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన కచ్చితమైన పూర్తి సమాచారం తమ వద్ద లభిస్తుందని అగస్టిన్ పేర్కొన్నారు.
- Advertisement -