- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని 316 ప్రభుత్వ పాఠశాలల్లో హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో, మధ్యాహ్న భోజనం కూడా ఇదే విధంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
- Advertisement -


