హైదరాబాద్ : తొలి డిజైనింగ్ ప్లాట్ఫాం అయిన డిజైన్ డెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం డిజైనర్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 13 నుండి 15వ తేది వరకు జరగనున్న ఈ ప్రదర్శనను శుక్రవారం ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లాంచనంగా ప్రారంభించారు. ఇక్కడ ఇంటీరియర్, లైఫ్స్టైల్ బ్రాండ్లు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్లు, ప్రాపర్టీ ఓనర్లతో కనెక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.