- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
గ్రామపంచాయతీ కార్మికుడిగా గ్రామానికి సేవలందించిన వ్యక్తి, రిజర్వేషన్ పరంగా ఎస్సీ జనరల్ రావడంతో సర్పంచ్ బరిలో నిలిచాడు. రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన పళ్లెం లింగం బరిలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుడిగా, గ్రామంలో ఉదయమే చెత్తను తీసివేస్తూ, గ్రామానికి సేవ చేశారని, గ్రామంలో సమస్యలపై, ప్రజల అవసరాలపై అవగాహన కలిగిన వ్యక్తిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సేవ చేస్తానని అన్నారు.
- Advertisement -



