- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యందు శనివారం రాత్రి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల సంబరాలు వైభవంగా నిర్వహించినారు. పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించినారు. పోతురాజుల విన్యాసాలు , శివసత్తుల డాన్సులు, డీజే పాటల డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి ఉత్సవాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు కోన పత్రి కాశీరాం, రవి గౌడ్, రాము సంఘ సభ్యులు నరేష్, శ్యామ్, వంశీ, ప్రసాద్, ,గంగారం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -