ఈ ఎస్ విష్ణుమూర్తి
నవతెలంగాణ – ఆలేర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైన్ షాపులు మూసివేయాలని బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు భువనగిరి ఎక్సైజ్ సూపర్డెంట్ వెంకట కృష్ణమూర్తి జారీ చేశారు. భువనగిరి బీబీనగర్ పోచంపల్లి వలిగొండ మరియు రామన్నపేట మండలాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి అన్నారు. డిసెంబర్ 14న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి 14వ తేదీ న జరిగే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ఎక్సైజ్ అధికారుల అనుమతితో వైన్సులు తెరవాలన్నారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల రోజు మద్యం విక్రయాల నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఆదేశాలు ఉల్లగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని భువనగిరి ప్రభుత్వ మద్యపాన నిషేధ అధికారి విష్ణుమూర్తి హెచ్చరించారు.
రెండో విడత ఎన్నికల్లో గ్రామాలలో వైన్స్ లు తెరవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



