- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో పలువురు యువకులు సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ఏకైక లక్ష్యం అనే నినాదంతో బరిలో దిగి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. గెలిస్తే రాజకీయ నాయకులను, విద్య వేత్తలను, ఆర్థిక వేత్తల అభిప్రాయాలూ అనుగుణంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన యువత పట్టుదలను చూసి పలువురు వారిని అభినందిస్తున్నారు.
- Advertisement -



