- Advertisement -
– 660 పోలింగ్ సిబ్బంది: ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల విధులు కు నియమించబడిన పోలింగ్ సిబ్బంది సకాలంలో హాజరు కావాలని ఎంపీడీఓ అప్పారావు శుక్రవారం సూచించారు. ఆదివారం జరగనున్న రెండో దశ పోలింగ్ కు శనివారం అశ్వారావుపేట లోని జీజేసీ( గౌట్ జూనియర్ కాలేజ్ )ప్రాంగణంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసామని అన్నారు.మండలంలోని 220 పోలింగ్ కేంద్రాలకు గాను 220 పీఓ లు,440 మంది ఓపీఓ లు పోలింగ్ విధుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.
- Advertisement -



