- Advertisement -
హైదరాబాద్ : సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. మొబైల్ ఏఐ యుగంలో కొత్త రకం డిజైన్లలో తమ ఆధిపత్యాన్ని విస్తరిస్తోన్నట్లు తెలిపింది. ఇది తమ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. రెండుసార్లు తెరిచినప్పుడు ఇది 10-అంగుళాల అద్భుతమైన డిస్ప్లేను ఆవిష్కరిస్తుందని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ డివైస్ ఎక్స్పీరియన్స్ డివిజన్ ప్రెసిడెంట్, సీఈఓ టిఎమ్ రోహ్ పేర్కొన్నారు. అత్యంత సన్నని కేవలం 3.9 మిల్లీమీటర్ల మందంతో ఉండే గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ అత్యున్నత స్థాయి పనితీరును అందిస్తుందన్నారు. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చామన్నారు.
- Advertisement -



