ఈనెల 20న సర్పంచ్ , వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి గ్రామ ప్రజలు హాజరవ్వాలి..
మునుగోడు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు
ఈనెల 11న మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ వార్డు నెంబర్లు ఈనెల 20 న చేపట్టే ప్రమాణ స్వీకార మహోత్సవానికి మునుగోడు గ్రామపంచాయతీ కార్యాలయానికి మంగళవారం జీపీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి రంగులు వేయిస్తూ ముస్తాబు చేస్తున్నారు. పాలకవర్గం సమావేశ మందిరంలో నూతన కుర్చీల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 20 న నూతన సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయనున్న పాలకూరి రమాదేవి నరసింహ తోపాటు 14 మంది వార్డు సభ్యులు చేపట్టే ప్రమాణ స్వీకార మహోత్సవానికి గ్రామంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముస్తాబవుతున్న జీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



