- Advertisement -
రోడ్లపై వాహనాల క్రమబద్ధీకరణ..
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్లపై వాహనాల నిలిపివేతపై ఈ నెల 7న నవతెలంగాణ దినపత్రిక వార్తను ప్రచురించింది. నవతెలంగాణ వార్తకు ఎస్ఐ బోయిని సౌజన్య స్పందించి శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్ఐ అదేశానుసారం హెడ్ కానిస్టెబుల్ కనుకయ్య మండల కేంద్రంలోని ఓ బ్యాంకు అవరణం ముందు వాహనాల నిలిపివేతపై క్రమబద్ధీకరణ చేపట్టారు. రోడ్లపై వాహనాల నిలివేతపై జరిమాన విదించనున్నట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -



