- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. మోండా మార్కెట్లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ అలముకోవడంతో మార్కెట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు.
- Advertisement -



