- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయి గూడెం మండలంలో ఏటూరు గ్రామపంచాయతీలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బిఆర్ఎస్ పక్షాన విజయం సాధించిన ఏటూర్ సర్పంచ్ కురుసం రమాదేవి, నాగరాజును బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అభినందించారు. అదేవిధంగా ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కాకులమర్రి ప్రదీప్ రావు, అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, సింగారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం నరేందర్, మంచాల లక్ష్మీనారాయణ ఆకుల నారాయణ, మండలోజు శ్రీనివాస్, గడ్డం నాగ మల్లయ్య, సుగ్గుల సంజీవ్, గావిడి నాగబాబు, గోస్కుల రాంబాబు , చిట్యాల రాజు, బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


