Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే తోటా సహకారంతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

ఎమ్మెల్యే తోటా సహకారంతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ – మద్నూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు సహకారంతో మద్నూర్ మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని మద్నూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలోని మాణిక్ ప్రభు ఆలయ గల్లీలో బుధవారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు భూమి పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు యంజప్ సాయిలు, సాహెబ్ రావ్, గలిబే హన్మంత్, బండి హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -