- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :భారత సైన్యం తన సోషల్మీడియా పాలసీని సవరించింది. సైనికులకు ఇన్స్టాగ్రామ్ వీక్షించేందుకు అవకాశం కల్పించినప్పటికీ, పోస్టింగ్, కామెంట్, షేరింగ్, రియాక్టింగ్, మెసేజింగ్ వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించింది. భద్రతాపరమైన కారణాలు, సున్నిత సమాచారం లీక్ కాకుండా ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు సైన్యం తెలిపింది. ఈ మేరకు అన్ని ఆర్మీ యూనిట్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
- Advertisement -



