- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గురువారం క్రిస్మస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో యావే మినిస్ట్రీ ఆధ్వరంలో క్రిస్మస్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ సర్వ మానవళి రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని, ఏసుక్రీస్తు లోక రక్షకుడు పాప విమోచకుడు అని క్రీస్తు జన్మదిన పర్వదినాన్ని ఉద్దేశిస్తూ పాస్టర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



