
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని ఖైరతాబాద్ జోన్ డిఎంహెచ్ఓ డాక్టర్ పి శ్రీనివాస్ అన్నారు. గురువారం బేగంబజార్ లోని పానీపూర క్లస్టర్ ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వచ్చినప్పుడు వారికి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు రక్త పరీక్ష నిర్వహించి మందులను అందజేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే ప్రభుత్వ వైద్యం పై రోగులకు భరోసా కలుగుతుందని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు అందించే న్యూట్రిషన్ కిట్టు, వివిధ రకాల బెనిఫిట్స్ పై చెప్పాలని వైద్యులకు, ఏఎన్ఎంలకు చెప్పారు. వైద్య వృత్తిని ప్రజాసేవగా భావించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తాను ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానని ఎప్పుడు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పానీపూర క్లస్టర్ ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ మల్లీశ్వరి, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ అరవింద్, డాక్టర్ రామ్ చందర్, డాక్టర్ రఫత్ తన్వీర్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ బుశ్రా, డాక్టర్ రవికాంత్, డాక్టర్ నికిత, డాక్టర్ అనుదీప్,ఏఎన్ఎంలు ,ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ,అకౌంటెంట్లు వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.