- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతూ, రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నీటి వాటాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ అంశం పైన పార్టీ వాయిస్ వినిపించటంతో పాటుగా బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించనున్నారు.
- Advertisement -



