ప్రతి ఒక్కరు సైనికుల వలె పని చేయాలి..

– బూత్ కమిటీ ఇన్చార్జిలే కీలకం.. బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్.
నవతెలంగాణ- సూర్యాపేట
దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేసి బీఎస్పీ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల బీఎస్పీ పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లికి ఎలాంటి పదవి రాలేదు కానీ,మంత్రి జగదీష్ రెడ్డి బంధువైన ఎంసీ కోటిరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆరోపించారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో 100 కోట్ల రూపాయలు అవినీతికి గురయ్యాయని విమర్శించారు. మంత్రి కి చిత్తశుద్ధి ఉంటే అవినీతి పై నిరూపించుకోవడానికి వాణిజ్య మార్కెట్ సెంటర్ కు రావాలని సవాల్ విసిరారు.నియోజకవర్గంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి లు తన తో  పోటీ అని అనుకునే స్థితికి వచ్చామని అన్నారు.మరో వారం రోజుల్లో తాను గెలుస్తాననే ప్రచారం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.90 శాతం బహుజనులు ఉన్న బిఎస్పి పార్టీ కాకుండా సూర్యాపేట నియోజకవర్గo లో వేరే పార్టీ గెలవబోదని అని పేర్కొన్నారు.డిసెంబర్ 3 తరువాత బీఎస్పీ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునే రోజు వస్తుందని తెలిపారు.దొరలపై చేస్తున్న మన పోరాటానికి బూత్ స్థాయి కమిటీ ద్వారా పోరాటంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.బూత్ కమిటీ ఇంచార్జి లే కిలకమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బుక్య కాంత, 6 వ వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి లింగ నాయక్,పాతర్లపాడు సర్పంచ్ కేశబోయిన మల్లయ్య యాదవ్,సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ నాయక్, మాజీ కౌన్సిలర్ కుంభం రజిత నాగరాజు, బీఎస్పీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు చాంద్ పాషా, మీర్ అక్బర్, రామన్నగూడెం మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, మాజీ ఎంపిటిసి సూర సంధ్య వెంకన్న, మాజీ ఎంపిటిసి ముక్కాల పద్మ సుమన్,  వల్లాల సైదులు, ఉపసర్పంచి కుంభం సుజాత వెంకన్న, నగిరి అన్వేష్,పార్టీ నాయకులు,కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love