Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

రెగ్యులర్గా రాని హాస్టల్ వార్డెన్ ని తక్షణమే సస్పెండ్ చేయాలి
హాస్టల్ లో కనీసం విద్యార్థులకు త్రాగడానికి వాటర్ అందుబాటులో లేవు
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
నవతెలంగాణ – కాటారం

కాటారం సబ్ డివిజన్  భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాటారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని రుద్రారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఎస్ఎఫ్ఐ నాయకులు పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థులను హాస్టల్ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ, కుమ్మరి రాజు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లో చదువుకునే విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

హాస్టల్లో విద్యార్థులకు కనీసం త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని అన్నారు. వాష్ రూమ్స్ పరిశుభ్రంగా ఉంచడం లేదని అన్నారు. రూమ్స్ కూడా ఊడవడం లేదని, వాచ్మెన్ కూడా రెగ్యులర్ గా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు.

వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల హాస్టల్ విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కాటారం సబ్ డివిజన్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ కమిటీ సభ్యులు తరుణ్, నితిన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -