Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మీయ సభకు తరలిన బీఆర్ఎస్ కార్యకర్తలు

ఆత్మీయ సభకు తరలిన బీఆర్ఎస్ కార్యకర్తలు

- Advertisement -

బీఆర్ఎస్ బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు మురళి  
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామం నుండి అధిక సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి బయలుదేరామని బిఆర్ఎస్ పార్టీ  గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు మురళి తెలిపాడు. శనివారం మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రథసారథి కేటీఆర్, మాజీ మత్రి సత్యవతి  రాథోడ్ , మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు కవిత  మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చేతుల మీదుగా బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచ్ చిర్రా యకాతం గౌడ్ సన్మానo ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని అందుకున్నామని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం  వస్తుందని ఈ సన్మాన కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -