- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని పుల్లగిరి గ్రామపంచాయతీ కోడావత్ తాండ కు చెందిన కోడావత్ హున్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నిల మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.10వేల రూపాయలు ఆర్థిక సహాయన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడవ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశ్య, గోవిందు నాయక్ తండావాసులు తదితరులు వున్నారు.
- Advertisement -



