- Advertisement -
భారత్, శ్రీలంక ఐదో టీ20 నేడు
రాత్రి 7 నుంచి స్టార్స్పోర్ట్స్లో
తిరువనంతపురం : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ విజయంతో నవ చరిత్ర లిఖించిన అమ్మాయిలు.. శ్రీలంకపై టీ20 సిరీస్ క్లీన్స్వీప్ విజయంతో ఈ ఏడాదిని మరింత మధురంగా ముగించేందుకు ఎదురుచూస్తున్నారు. షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్లు బ్యాట్తో.. రేణుక సింగ్, అరుంధతి రెడ్డి, వైష్ణవి, శ్రీచరణి బంతితో అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టులో అందరూ ఫామ్లో ఉండటంతో నేడు ఆఖరు టీ20లోనూ అదిరే విజయంతో 5-0తో క్లీన్స్వీప్ చేయాలని భారత్ ఎదురుచూస్తుంది.
- Advertisement -



