- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండలంలో పరిధిలోని ప్రతాపగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వర్ రావు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మర్రిపల్లి మల్లన్న బోనాలు జనవరి మొదటి వారంలో ఉండగా.. ముందస్తుగా గ్రామ పంచాయతీ సిబ్బందితో ముళ్ల పొదలు తొలగించి శానిటేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శం గ్రామంగా తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట కారోబార్ మెండ మల్లేష్ ఉన్నారు.
- Advertisement -



