- Advertisement -
– పోచంపల్లి సర్పంచ్ కుందూరు వెంకన్న
నవతెలంగాణ -పెద్దవంగర: పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా ముందుస్తు నట్టల నివారణ మందు తాపి కాపాడుకోవాలని పోచంపల్లి సర్పంచ్ కుందూరు వెంకన్న అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని మూగ జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువైద్య సహాయకులు వాంకుడోత్ అనిల్ తో కలిసి చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాడి రైతులు పశు సంపదను వృద్ధి చేసుకుని, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో గోపాల మిత్ర నాలి వెంకన్న, తొర్రూర్ డైరీ చైర్మన్ రాసాల సమ్మయ్య, రైతులు రాసాల కృష్ణమూర్తి, పబ్బతి సమ్మయ్య, పబ్బతి ఉప్పలయ్య, పబ్బతి సంపత్, పబ్బతి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



