నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
దివ్యాంగుల ఆర్ధికాభివృద్ది కోసం అందించే వివాహ ప్రోత్సహక పధకాన్ని సద్వివినియోగించుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.నరసింహ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాoగులను సకలాoగులు వివాహం చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అoదిస్తున్న రూ.1,00,000/- ల వివాహ ప్రోత్సహాక బహుమతిని దివ్యాoగులు, దివ్యాoగులను విహాహం చేసుకోనినా కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.కావున దివ్యాoగులు, సకలాoగులను వివాహము చేసుకోని తేది: 19/05/2025 తరువాత దివ్యాoగులు, దివ్యాoగులను వివాహం చేసుకుంటే అట్టి దoపతులు www.epass.telangana.gov.in అనే వెబ్ సైట్ ద్వారా వివాహం జరిగిన ఏడాది లోపు దరఖాస్తు చేసుకొని , సంబంధిత సమగ్ర శిశు అభివృధి కార్యాలయoలో దరఖాస్తు ఫారoను అందజేసి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
దివ్యాంగులు వివాహ ప్రోత్సాహక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



