- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బేగంపేటలోని ఐఎఎస్(IAS) ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎఎస్ లు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.
- Advertisement -



