- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి నౌళ్ళ సంపత్ మహరాజ్ తోపాటు పలువురు దళితులు 1600 కిలోమీటర్ల దూరంలో పూనే పక్కన గల భీమా కోరేగావ్ గ్రామంలో ఉన్నటువంటి శౌర్య స్థూపాన్ని గురువారం సందర్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి మహోన్నతమైనటువంటి అణగారిన వర్గాల యొక్క వీర గాధను గుండె గుండెకు అందజేయడానికి మంథని నియోజకవర్గ దళిత బహుజనుల నాయకుడు పుట్ట మధుకర్,బహుజన ఉద్యమ భావుట తగరం శంకర్ ఆదేశాల మేరకు భీమ కోరేగావ్ సందర్శించడం జరిగిందని తెలిపారు.
- Advertisement -



