- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మండల పీఆర్టియు 2026 సంవత్సరము క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ ను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం ముందుంటుందన్నారు. సంఘం బలోపేతానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం మండలంలోని ఉపాధ్యాయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురికి క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ లను అందజేశారు.కార్యక్రమంలో పిఆర్ టియు మండల అధ్యక్షుడు పొద్దుటూరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అంజాద్ సుల్తాన్,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



