Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలు18న మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి

18న మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 18న మేడారం మహాజాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సీతక్క, పోరిక బలరాం నాయక్​తో కలిసి వనదేవతలను దర్శించుకొని, అభివృద్ధి పనులను పరిశీలించారు. మహాజాతర అభివృద్ధి పనులను జనవరి 12లోగా పూర్తి చేయాలని, పని చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు సూచించారు. సీఎం 18న మేడారం వచ్చి రాత్రి బస చేసి, 19న ఉదయం వనదేవతలను దర్శించుకొని, అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -