హైదరాబాద్: ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట్ర ఈక్వెస్ట్రియన్ పోటీల్లో సత్తా చాటిన ద హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ సెంటర్ (టీహెచ్ఈసీ) క్రీడాకారులను అకాడమీ అధ్యక్షులు నరసింహా రెడ్డి, రచయిత అనంత్ శ్రీరామ్ ఆదివారం ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ హాక్స్లో శ్రీ తారాకకు కాంస్యం, డ్రెస్సేజ్లో మైత్రి ప్రసన్నకు కాంస్యం, షో జంపింగ్ ఓపెన్ కేటగిరీలో పిల్లి సూర్య ప్రకాష్కు కాంస్యం, లెఫ్ట్నెంట్ కల్నల్ వివేక్ సుంకారికి టాప్ స్కోర్ షో జంపింగ్ ఓపెన్లో కాంస్యం సహా టెంట్ పెగ్గింగ్లో రజతం, షో జంపింగ్లో హైదర్ అలీకి స్వర్ణ పతకాలు దక్కాయి. అభినందన కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు లెఫ్టినెంట్ కల్నల్ వివేక్ సుంకారి, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



