Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతలసేమియా రహిత తెలంగాణ సాధిద్దాం

తలసేమియా రహిత తెలంగాణ సాధిద్దాం

- Advertisement -

కలిసికట్టుగా 2035 నాటికి లక్ష్యాన్ని చేరుకుందాం
ప్రతి తలసేమియా రోగికీ పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకుంటాం
పేషెంట్లకు చికిత్స అందించేందుకు మరో 3 సెంటర్లు : ఏసియన్‌ తలసేమియా సదస్సులో మంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలోనే మొట్టమొదటి తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ రోగులందరికీ పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తలసేమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని కమలా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ఏసియన్‌ తలసేమియా సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపర నిర్ధారణలు మాత్రమే కావనీ, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేనరికం పెండ్లీండ్ల వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ జన్యుపర వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని వివరించారు. దానిని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్‌, కౌన్సిలింగ్‌, సామాజిక అవగాహన కల్పించడమే సరైన మార్గమనీ, నివారణే అత్యుత్తమ చికిత్స అని ఆయన నొక్కి చెప్పారు.

ఆ వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తలసేమియా, సికిల్‌సెల్‌ సొసైటీ సహకారంతో మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణీకి పరీక్షలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో డేకేర్‌ సెంటర్లను నిర్వహిస్తున్నామనీ, త్వరలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌లలో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడిం చారు. సికిల్‌సెల్‌ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటి వరకు 11 లక్షల మందికిపైగా స్క్రీనింగ్‌ పూర్తి చేశామనీ, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌ ఆస్పత్రిలో బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తలసేమియా, సికిల్‌సెల్‌, హిమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను టీ డయాగస్టిక్స్‌ సెంటర్లలో ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఇంకా అవసరమైన టెస్టులనూ ఉచితంగా చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -