Tuesday, April 28, 2026
E-PAPER
Homeకరీంనగర్అమృత్ పనులు వేగవంతం చేయాలి.. కౌన్సిలర్ల డిమాండ్

అమృత్ పనులు వేగవంతం చేయాలి.. కౌన్సిలర్ల డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
రాయికల్ పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం పురపాలక కార్యాలయంలో చైర్మన్ కట్కం రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పట్టణ పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలు,అమృత్ 2.0 పథకం అమలు తదితర అంశాలపై చర్చించారు.పట్టణంలోని అన్ని వార్డుల్లో అమృత్ నీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,సీసీ రోడ్ల మరమ్మత్తులు, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సభ్యులు సూచించారు.మొత్తం 25 అంశాలకు గాను 25 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా,టేబుల్ ఎజెండాలో ప్రతిపాదించిన అంశాల్లో 2 అంశాలు ఆమోదించబడ్డాయి. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు,వైస్ చైర్‌పర్సన్ తురగ సౌజన్య,కౌన్సిలర్లు,మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -