Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌

కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌

- Advertisement -

ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్‌ తూట్లు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: టీపీసీసీ చీఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) నాయకురాలు కల్వకుంట్ల కవిత వేసిన ప్రశ్నలకు సమాధానమివ్వలేని స్థితిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సేవాదళ్‌ సమర్థ శిక్షణ శిబిరాన్ని జెండా ఆవిష్కరించి ఆయన ప్రారంభించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి సేవాదళ్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయనీ, బీజేపీ విధానాలను ఎండగడుతున్నదని తెలిపారు. మోడీ సర్కార్‌ ప్రజస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదనీ, కుటుంబ వివాదంలో కేసీఆర్‌ సతమతమవుతున్నారనీ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణను 50 ఏండ్లు వెనక్కి నెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి సహా పలువురు నాయకులు, సేవాదళ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -