నవతెలంగాణ – భీంగల్
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా భీంగల్ పట్టణంతోపాటు అన్ని గ్రామాలలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగిర్యాల్ గ్రామంలోని ఆదర్శ యూత్ అధ్యక్షులు అన్నవొయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానంద వారి బాటలో నడవాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టాలని వారి యూత్ తరఫున కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ… దేశ యువతే రేపటి భారతానికి పునాది అన్న నమ్మకాన్ని వివేకానందుడు ఎప్పుడూ వ్యక్తం చేసేవాడు. యువ మనస్సుల్లో దాగి ఉన్న నైతిక, మేధో, సామాజిక శక్తే దేశ గమనాన్ని మార్చగలదని ఆయన వివరించారు. అందుకే ఆయన విద్యపై పెట్టిన దృష్టి కేవలం పాఠ్యాంశాలు, పరీక్షల వరకే పరిమితం కాలేదు. వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం ఇవే నిజమైన విద్య లక్ష్యాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, మాజీ ఎంపిటిసి సుమలత రాజు, మాజీ ఉపసర్పంచ్ శ్రీకాంత్, గ్రామ యువజన సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



