- Advertisement -
నవతెలంగాణ-మెండోర
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బుస్సాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద బోధ యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. యువత వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నూత్ పల్లి శ్రీనివాస్ రెడ్డి , వేల్పూరు మార్కెట్ కమిటి డైరక్టర్ ఏనుగు సాయరెడ్డి , కొప్పుల శ్రీనివాస్ , ఏలేటి శ్రీనివాస్ , మార ముత్యం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



