- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
దేవుని గూడా గ్రామంలో రైతు వేదిక వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్పంచ్ రామ టైంకి రాజేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ను బహుమతి ప్రధానం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడమే తమ లక్ష్మన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి విశ్వ శ్రీ ఏఈఓ అక్రమఖాన్, ఉపాధ్యాయులు తుంగూరి గోపాల్ రజిత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



