- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ వేళ ఏపీలోని సొంతూళ్లకు వెళ్లేవారితో HYD-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ రికార్డు స్థాయిలో పెరిగింది. టోల్ ప్లాజా నుండి సుమారు కిలోమీటరున్నర మేర వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాహనాల తాకిడి పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- Advertisement -



