- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్లోని భాగేశ్వర్ జిల్లాలో సోమవారం ఉదయం 7.25 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర చలి ఉన్నప్పటికీ, ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. భాగేశ్వర్తో పాటు రిషికేశ్, హరిద్వార్లలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.
- Advertisement -



