- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జర్మనీ విమానాశ్రయాల మీదుగా మూడో దేశాలకు వెళ్లే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇకపై ట్రాన్సిట్ వీసా అవసరం లేదని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, భారత ప్రధాని మోడీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులకు ప్రయాణం సులభతరం కానుంది. అయితే, ఈ వీసా రహిత సౌకర్యం కేవలం విమానాశ్రయ అంతర్జాతీయ ట్రాన్సిట్ ఏరియాలో ఉండేవారికి మాత్రమే వర్తిస్తుంది.
- Advertisement -



