- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన ప్రభులింగం అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువ నాయకులు ఇలియాస్ సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ 5 వేల రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద రాజిరెడ్డి, రాజు, మహాలింగం, శ్రీనివాస్, అనసూయ, కళావతి, రాకేష్, సతీష్, శివకుమార్, మాల జంగం ప్రతినిధులు వీరస్వామి, కాశీలింగం, రాజు, విజయ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



