మేడే. ఎనిమిది గంటల పనిదినం కోసం జరిగిన పోరాట సంస్మరణగా ప్రపంచ కార్మిక వర్గ అంతర్జాతీయ దినోత్సవం మే 1వ తేదీన జరుగుతుంది. చికాగోలోని హే మార్కెట్ చౌక్లో జరిగిన సంఘర్షణలతో అది అజరామరమైంది. 1889లో అంతర్జాతీయ ఫెడరేషన్ దాన్ని నిర్ణయిస్తే ఇప్పుడు ప్రపంచమంతటా కార్మిక హక్కుల సంఘీభావ దినోత్సవంగా వారి హక్కులను చాటే రోజుగా గుర్తించబడింది. ఆ మే 1వ తేదీన చికాగో నగర కార్మికవర్గం భారీ వెల్లువగా కదిలివచ్చారు. నగరంలోని సంఘటిత కార్మికవs ఉద్యమ పిలుపు మేరకు పనిముట్లు పడేసి సమ్మెకు దిగారు. అప్పటికి కార్మికవర్గం అంత పెద్దఎత్తున కదలిరావడం అదే మొదలు. ఆ సమయంలో ఎనిమిది గంటల పనిదినం, ఆ ఉద్యమం సమ్మెకు ఇచ్చిన పిలుపు దాని స్వభావం వీటన్నిటికీ రాజకీయ ప్రాధాన్యత వుంది. హే మార్కెట్లో రక్తం పారింది. పార్సన్స్, స్పైస్, ఫిషర్, ఎంగెల్ లను ఉరి తీయడానికి, ఇతర సమరశీల చికాగో నాయకులను జైళ్లపాలు చేయడానికి దారితీసింది. వారి పోరాటానికి చికాగో అభివద్ధి నిరోధక యాజమాన్యాల ప్రతీఘాత సమాధానమది. దేశమంతటా యజమానులు దాడి ప్రారంభించాలనే పిలుపు అది. 1885-86 సమ్మె ఉద్యమ కాలంలో పోగొట్టుకున్న తమ ప్రాబల్యాన్ని మళ్లీ స్థాపించుకోవడం కోసం 1886 ద్వితీయార్థమంతా యాజమాన్యాల దాడులు తీవ్రతరం కావడాన్ని చూసింది.
చికాగో కార్మిక నాయకులను ఉరితీత తర్వాత ఏడాదికి 1888లో సెయింట్ లూయిస్లో జరిగిన ఫెడరేషన్ సదస్సులో 8 గంటల పనిదినం కోసం పోరాటాన్ని పున:ప్రజ్వలింపజేయాలని నిర్ణయించింది. కార్మికవర్గ సమస్యపై అప్పటికి రెండేళ్లుగా పోరాట సంప్రదాయంగా అమలవుతున్న మే1వ తేదీనే 8 గంటల పనిదినం కోసం మరింత శక్తివంతమైన కార్మికోద్యమం పునరారంభానికి సందర్భంగా తీసుకున్నది. వర్గ సమైక్యత, సంఘీభావం అమెరికా తీరాలను దాటి ప్రపంచమంతటా విస్తరించింది. చరిత్రను తీర్చిదిద్దే ఒక ప్రత్యేక వర్గంగా కార్మికలోకం సమిష్టి జోక్యానికి అత్యంత శక్తివంతమైన వ్యక్తీకరణగా రూపొందింది.
మార్క్స్ మాటల నిర్ధారణ
ఇప్పటి వరకూ వున్న సమాజ చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రేనన్న మార్క్స్ వ్యాఖ్యానం అత్యంత ప్రసిద్ధమైంది. మారిన వర్గ పోరాట పరిస్థితులు, దాని పాఠాలను జీర్ణం చేసుకోవడం ద్వారా అనుభవాలను అంచనా వేసుకోవడానికీ, రానున్న కర్తవ్యాలను నిర్ణయించుకోవ డానికి నూతనావకాశం లభించినట్టవుతుంది. ఏ విధంగా చూసినా మేడే ఉత్సవాలు, వాటికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం అన్నవి మార్క్స్ వాదనల సమంజసత్వానికి మహత్తరమైన నిదర్శనాలు. పెట్టుబడి లక్షణాలను గురించి మార్క్స్ చేసిన నిర్దిష్టమైన అధ్యయనం దోపిడీకి వ్యతిరేకంగా, సమాజ మార్పు కోసం పోరాడటానికీ ఒక మార్గ నిర్దేశం ఇస్తూనే వుంటుంది. పెట్టుబడి అనేది ఒకచోట పోగుపడటం, కేంద్రీకరిం చబడటం సహజసిద్ధమైన లక్షణమని మార్క్స్ అధ్యయనం స్పష్టమైన సంకేతమిచ్చింది.
పెట్టుబడి నమూనా లక్షణం
ఏమైనా పెట్టుబడి నమూనా స్వతంత్రమైన దేమీ కాదు. శ్రామికులతో ఘర్షణకు దారితీస్తుంది. కార్మికుల స్పందన ఆ ఉత్పాదక శక్తుల అభివృద్ధికి లోబడి వుంటుంది. కనుకనే కార్మికోద్యమం కూడా ఉత్పత్తి సాధనాలలో నిరంతరాయంగా వచ్చే మార్పులకు సరిపెట్టుకోవలసి వుంటుంది. సాంకేతికతలో పెద్ద ముందంజలు కూడా అందులో భాగంగా వుండేవే. పెట్టుబడి యాజమాన్యం సాంకేతికతలో పురోగమనాన్ని ఉపయోగించుకుని మరింత లాభం కొల్లగొట్టాలనే చూస్తుంటుంది. కార్మికవర్గం ఈ విధంగా దోచుకోవడానికి జరిగే ప్రయత్నానికి తగినట్టు స్పందించవలసి వుంటుంది. ఈ పోరాటం కాలనుగుణంగా సాగుతుంటుంది. జాన్ హెన్రీ అతని వీరోచిత సుత్తి ఆవిరి యంత్రం తొలి రోజులలో కార్మికుల శౌర్య పోరాటాల గాథలను నమోదు చేశాయి. ఇప్పుడు సరికొత్త కత్రిమ మేధస్సు వచ్చిన కాలం దాకా ఈ పోరాటం కొనసాగుతూనే వున్నది.
మారిన పరిస్థితుల సవాలు
ఒక దశాబ్దం క్రితం జాకోబిన్లో స్మార్ట్ఫోన్ సొసైటీ అనే అద్భుతమైన రచన పనిగంటల పెంపులో స్మార్ట్ ఫోన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను అక్షరీకరించారు. సూర్యాస్తమయం తర్వాత తమ ఈమెయిళ్లను ఆపేయాలని జర్మన్ కార్మికులు ఒక డిమాండ్ ముందుకు తీసుకురాగా కొంతకాలం తర్వాత ఆమోదించబడింది. సమకాలీన పెట్టుబడిదారీ విధానం ప్రస్తుత దశ ఉత్పత్తి శక్తుల బ్రహ్మాండమైన పెరుగుదలకు కారణమైంది. తత్ఫలితంగా పెట్టుబడికీ కార్మికులకు మధ్యన సంబంధం కూడా బాగా పెరిగి దోపిడీ పెరుగుదల వల్ల సవాలు కూడా తీవ్రమైంది, సమకాలీన పెట్టుబడిదారీ విధానం ప్రస్తుత దశలో ద్రవ్యపెట్టుబడి ఇదివరకు లేని దూకుడు ప్రధాన లక్షణంగా వుంటోంది. దానివల్ల అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనే లక్షణానికి దారితీసింది. దానివల్ల ఉత్తరోత్తరా అది నయా ఉదారవాద ప్రపంచీకరణకు నడిపించింది. అయితే ఈ లక్షణంలోనూ దేశాలవారీ నిర్దిష్టతలతో కూడిన నమూనాలు వచ్చాయనేది న్పుిమే. అయితే ఈ దశలోనే పెట్టుబడుల కేంద్రీకరణ విపరీత స్థాయికి చేరింది. దీనివల్ల ఇనుమడించిన ఉత్పాదక కార్యకలాపాల పంపిణీ మాత్రం లోపభూయిష్టంగానే వుండిపోయింది. ఈ సమకాలీన వాస్తవం వల్లనే దేశాలలో అంతర్గతంగానూ దేశాలకు వెలుపల కూడా వలసలు అనేవి విపరీతంగా పెరిగాయి.
శ్రామికుల ఈ వలసలు అంతర్జాతీయ రాజకీయాలలో ప్రతిబింబిస్తున్నది. అమెరికా-ఇజ్రాయిల్ పాశవిక జాతి హత్యాకాండకు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల పట్ల వ్యక్తమైన అపూర్వ సంఘీభావం ఇందుకో గొప్ప ఉదాహరణ. ఈ సంఘీభావం అనేక యూరోపియన్ దేశాలలో ఇజ్రాయిల్ అనుకూల మితవాద రాజకీయవేత్తలను, అమెరికా వత్తాసుదార్లను కూడా కదిలించేసింది.
భారత దేశంలో…
భారత దేశంలోనైతే రాజకీయ దృశ్యంలో వచ్చిన పెనుమార్పు కార్మికోద్యమంపై ప్రభావం చూపిస్తున్నది. ఈ నయా ఉదారవాద విధానాల వల్ల వచ్చిన దూకుడు, మోడీ ప్రభుత్వ నాయకత్వంలోని కార్పొరేట్ మతతత్వ కూటమి పచ్చి మతతత్వ సమీకరణకు పాల్పడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని దెబ్దతీసి, నిరంకుశ ఫాసిస్టు పాలనను బలోపేతం చేస్తున్నది. దీంతోపాటే సామాజిక ఆర్థిక అసమానతల పెరుగుదల, నిరుద్యోగం విజృంభణ కూడా ఈ కాలంలోనే సంభవిస్తున్నది.
దీనివల్ల మన కార్మికవర్గ సారానికే ముప్పు కలుగుతున్నది..నయా ఫాసిస్టు పాలన లక్షణాలు అది తెచ్చిన నూతన లేబర్ కోడ్లలో వ్యక్తమవుతున్నది. వాటిని గత ఏడాది తీర్చి దిద్దినప్పటికీ నూతన ఆర్థిక సంవత్సరంతోనే అవి అమలుకు తీసుకొచ్చారు. పెట్టుబడి నూతన లక్షణాలలో భాగంగా కార్మికులు, అసంఘటిత రంగం, యథాలప పని అప్పగింత వంటివి బాగా వేగం పుంజుకుంటాయి. సరైన నిజవేతనం కోల్పోవడం కార్మికులను గోడకేసి నిలబెట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది మేడే పూర్వ రంగం చూస్తే ఇప్పటి¹కే హర్యానా, నోయిడా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లోని ఉద్దం సింగ్ నగర్, పంజాబ్ లోని భటిండా వంటి చోట్ల అనేక ఆకస్మిక శ్రామికవర్గ కార్యాచరణలు కనిపిస్తాయి.
సరే ఈ ఏడాది మేడే నిర్వహించడమంటే…నిశ్శబ్దం భగ్నం కావడానికి దోహదం చేసే నిర్దిష్ట చర్యలను అధ్యయనం చేయవలసి వుంటుంది. కార్మికోద్యమం నిర్వహించవలసిన పాత్ర ఏమంటే…చెల్లాచెదురుగా సాగుతున్న ఈ కార్యాచరణలను కలగలిపి ఒక్క తాటి పైకి తేవడంఒక శక్తివంతమైన సమైక్య ఉద్యమంగా నడిపించడం. ఆ విధంగా కార్మిక కోడ్లను వెనక్కు కొట్టవలసి వుంటుంది. ఆ విధమైన శ్రామిక వర్గ రాజకీయ క్రియాశీలతే ఉత్తరోత్తరా నయా ఫాసిస్టు దురాక్రమణ సవాలను స్వీకరించవలసి వుంటుంది.
స్మార్ట్ఫోన్ కాలంలో కార్మికోద్యమ పాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



