నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చేరాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవల రంగంలో తెలంగాణ తిరుగులేని పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రజలు సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
తెలుగు ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



