- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ను అత్యంత ప్రమాదకర కేటగిరి (AL3) లో చేర్చింది. జనవరి 8 నుండి అమల్లోకి వచ్చిన ఈ మార్పుతో, భారత్ నుంచి ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరమయ్యాయి. విద్యార్థులు తమ ఆర్థిక స్థితి, ఆంగ్ల ప్రావీణ్యం, తాత్కాలిక ప్రవేశ ఉద్దేశ్యాలకు సంబంధించిన విస్తృతమైన రుజువులను అందించాల్సి ఉంటుంది. ఇటీవల కేరళలో బయటపడిన భారీ నకిలీ డిగ్రీల వ్యవహారం ఈ మార్పుకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియాలో విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
- Advertisement -



