- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో సంక్రాంతి వైభవం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో నిండి ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
- Advertisement -



