సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది.
శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పధ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ,’రొమాంటిక్ లవ్ సస్పెన్స్తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్, భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది. బావ-మరదలుగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతాం’ అని చెప్పారు.
నిర్మాత తాటి బాలకష్ణ మాట్లాడుతూ, ‘ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. నాయకానాయికలు ఆకాష్, భైరవి పాత్రలు అందర్నీ సర్ప్రైజ్ చేస్తాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేస్తుంది. ఇక కథానుగుణంగా మా సంగీత దర్శకుడు యశ్వంత్ సమకూర్చిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన అతి త్వరలోనే మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వినూత్న కాన్సెప్ట్తో మా సినిమా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. రఘు బాబు, పధ్వీ, ప్రభావతి, మహేందర్, డీడీ శ్రీనివాస్, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: శివ వరప్రసాద్ కేశనకుర్తి, నిర్మాత: తాటి బాలకష్ణ,సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్.
గ్రామీణ నేపథ్యంలో ‘కొత్త మలుపు’
- Advertisement -
- Advertisement -



